The recent decision by China to block a bid at the United Nations to list Maulana Masood Azhar, chief of Pakistan-based Jaish-e-Mohammed (JeM) militant group, is doing "material harm" to its ties with India, top American experts said on Tuesday. <br /> <br />జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్పై బీజింగ్ తీరు భారత్- చైనా మధ్య సంబంధాలకు ఏమాత్రం మంచిది కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడ్డారు. అజహర్పై చైనా తీరు మారాలని అంటున్నారు. <br />పాకిస్తాన్లో తలదాచుకున్న అజహర్ విషయమై ఐక్య రాజ్య సమితిలో చైనా తీరు ఏమాత్రం కాదని అంటున్నారు. చైనా తీరు పాకిస్తాన్కు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. <br />ఇదిలా ఉండగా, మసూద్ అజహర్ను భద్రతా మండలిలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చేసే ప్రయత్నాలను చైనా నాలుగోసారి అడ్డుకున్న నేపథ్యంలో అమెరికా.. భారత్కు మళ్లీ మద్దతు పలికింది. <br />అజహర్ను చెడ్డ వ్యక్తిగా పేర్కొన్న అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిదేనని పేర్కొంది. అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చైనా ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని అమెరికా విదేశాంగ శాఖ నిలదీసింది. <br />అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు శాశ్వత సభ్యత్వ దేశాలు సుముఖంగా ఉన్నా ఐరాస భద్రతామండలి ఆంక్షల కమిటీలో వీటో అధికారంతో చైనా అడ్డుపుల్లలు వేస్తోంది. గత వారం కూడా చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకుంది. <br />